120 కోట్ల మంది భారతీయులు ముగ్ధులయ్యారు..మిన్నంటిన హర్షధ్వానాలతో జేజేలు పలికారు. త్రివర్ణ పతాకాలతో యువత జనసంద్రమైంది.అపూర్వం అనితరం అద్భుతం సువర్ణాక్షరలిఖితం.

భారత్‌కు రెండో వ్యక్తిగత స్వర్ణం తెచ్చేందుకు సింధుచేసిన పోరాటానికి120 కోట్ల మంది భారతీయులు ముగ్ధులయ్యారు…మిన్నంటిన హర్షధ్వానాలతో జేజేలు పలికారు.
భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో తెలుగింటి ఆడపడుచు,, భారత అగ్రశ్రేణి షట్లర్‌ పూసర్ల వెంకట సింధు రికార్డు సృష్టించింది….ఔరా…అనిపించింది.నిరంతర సాధన,నిర్విరామ కృషి,ఎల్లలులేని ఆత్మవిశ్వాసం….సింధుని ప్రపంచం ముందు విజేతగా నిలబెట్టింది.
త్రివర్ణ పతాకాలతో యువత జనసంద్రమైంది.
ఇది అపూర్వం..ఇది అనితరం..ఇది అద్భుతం…ఇది సువర్ణాక్షరలిఖితం.
సింధూ….నువ్వు సాధించిన విజయానికి మాటలు లేవు…ఆకాశమంత ఎత్తుకు ఎదిగావు…
మేన్ రోబో అందిస్తోంది అక్షరాల అభినందనల పుష్పగుచ్చం.

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY