విజయవాడ ఎంజి రోడ్డులోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు మూడు కిలోమీటర్లు వేలమందితో కలిసి సీఎం చంద్రబాబు తిరంగా యాత్రను చేపట్టారు ఈ యాత్రలో పవన్ కళ్యాణ్,దగ్గుబాటి పురందేశ్వరి ,నాదెండ్ల మనోహర్ ,మండలి చీఫ్ విఫ్ అనురాధ,సత్య కుమార్ ఎమ్మెల్యే బోండా ఉమా తదితరులు పాల్గొన్నారు
