బహుజన ధీరుడు సర్దార్ పాపన్న పట్టుదల ఆదర్శం

( మేన్ రోబో న్యూస్ బ్యూరో )
రఘునాథపల్లి ఆగస్టు 18:నాల్గు శతాబ్దాల క్రితం బహుజనులను ఏకంచేసి పాలకులను ఎదురించి పోరాడి గెలిచిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్న పట్టుదల ఏ తరానికైనా ఆదర్శం అని “గోపా” రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుర్రేముల యాదగిరి అన్నారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి సందర్భంగా రఘునాథపల్లి మండలం లోని మండెలగూడెం గ్రామంలో ఆదివారం రోజున 15 మంది కల్లు గీత కార్మికులను శాలువ మెమొంటోలతో  కుర్రెముల యాదగిరి గౌడ్ సన్మానం చేశారు.
ఈ కార్యక్రమములో పాల్గొన్న గోపా జనగామ జిల్లా గౌరవ అధ్యక్షుడు కన్నా పరశురాములు, గోపా జిల్లా అధ్యక్షుడు మేకపోతుల ఆంజనేయులు గౌడ్  పూర్వ అధ్యక్షులు అంబటి రాజయ్య శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కల్లు గీత కార్మిక సంఘం అధ్యక్షులు బత్తిని భిక్షపతి, కార్యదర్శి గొట్టిపర్తి మధుసూదన్, బత్తిని సత్తయ్య , బత్తిని అంజయ్య, ఎన్. బుచ్చయ్య, శిహెచ్ లక్ష్మయ్య , బాల్నే కుమార్, మాజీ సర్పంచ్ టి.  సత్య నారాయణ, బోనాసి కొమురయ్య, డ్యాగాల రాజశేఖర్, ఆకుల వినోద, పి. యాదగిరి, టీ. భాస్కర్, ఎన్.రంజిత్, బి. రాజేష్, ఎస్. రాజు తదితరులు పాల్గొన్నారు.

 

NO COMMENTS

LEAVE A REPLY