ఫిలిం ఛాంబర్ థియేటర్ లో “పద్మశ్రీ “చిత్ర ప్రదర్శన…Padmashri Telugu Movie Trailer | SS Patnaik | Sadasivuni Sireesha |#manrobo

( మేన్ రోబో ) జూన్ 12
ఎస్ ఎస్ పిక్చర్స్ బ్యానర్ పై సదాశివని శిరీష నిర్మాతగా, PVS రామ్మోహన్ రావు, మామిడి సాంబమూర్తి, కొత్తకోట బాలకృష్ణ సహ నిర్మాతలుగా ఎస్.ఎస్ పట్నాయక్ దర్శకత్వంలో నూతన నటీనటులతో యాక్షన్ ఓరియెంటెడ్ గ్రాఫికల్ హర్రర్ కామెడీ గా నిర్మించిన చిత్రం *”పద్మశ్రీ”.చిత్రాన్ని హైద్రాబాద్ లోని ఫిలిం ఛాంబర్ థియేటర్ లో ప్రదర్శించారు.
ఈ చిత్ర రచయిత దర్శకుడు ఎస్.ఎస్ పట్నాయక్.ఇటీవల ఇండియన్ ఫిలిం మేకర్స్ అసోసియేషన్ లో ది బెస్ట్ స్క్రీన్ ప్లే చిత్రంగా అవార్డును అందుకున్నారు ఈ సందర్భంగా చిత్ర రచయిత దర్శకుడు ఎస్.ఎస్ పట్నాయక్ చలనచిత్రరంగ ప్రముఖులకు,  కళాకారులకు కళాభిమానులకు  తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రివ్యూ థియేటర్ లో సాయి మహేంద్ర క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు.
ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు గారు, సీనియర్ నటుడు బాలాజీ ప్రముఖ సైకాలజిస్ట్ Dr. బి వి పట్టాభిరామ్ , ఆదికవి నన్నయబట్టు యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ Prof. ముత్యాల నాయుడు  ఎస్ ఎస్ పట్నాయక్, కథానాయకి రావు పల్లి సంధ్యారాణి తో పాటు నెగిటివ్ రోల్ లో చేసిన మరుపల్లి సతీష్, పూజారి లక్ష్మణరావు, ఫన్నీ రాజ్, పురుషోత్తమరావు తో పాటు ఎడిటర్ శ్రీనివాసరావు, సాయి మహేంద్ర క్రియేషన్స్ అధినేత, నిర్మాత మాసా సాయి కృష్ణ స్నేహసురభి తదితరులు హాజరయ్యారు.
పద్మశ్రీ చిత్రం ఒక ప్రయోజనాత్మక ప్రయోగం అని చిత్ర రచయిత దర్శకుడు ఎస్ ఎస్ పట్నాయక్, ను అభినందించారు.

NO COMMENTS

LEAVE A REPLY